తూర్పు గోదావరిలో పోలీసులు భారీగా నగదు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారు చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆడబ్బును సీజ్ చేసినట్లు దేవరపల్లి సీఐ బాల సురేష్ బాబు తెలిపారు.