ప్రముఖ నటి శ్వేతా మేనన్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ను ఉపయోగించారని ఆరోపిస్తూ మార్టిన్ మేనచెరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదులో, మార్టిన్ మేనచెరి శ్వేతా మేనన్ నటించిన ‘రతినిర్వేదం’, ‘పలేరి మాణిక్యం’, ‘కలిమన్ను’ వంటి చిత్రాలలోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించారు. ఆమె ఈ చిత్రాలలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను సోషల్ మీడియా, అడల్ట్ వెబ్సైట్లలో ప్రచారం చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఈ కేసు నమోదైన సమయంపై సినీ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్వేతా మేనన్ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‘ (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమెపై ఈ ఫిర్యాదు రావడం గమనార్హం.
Also Read…| ప్రియాంక జవాల్కర్ గ్లామర్ తళుకులు.. సోషల్ మీడియాలో వైరల్ !
ఈ కేసుపై ఇప్పటివరకు శ్వేతా మేనన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.శ్వేతా మేనన్ మలయాళ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించారు. ఆమె టాలీవుడ్లో నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రంలో కూడా కనిపించారు.









