ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు భరీగా వస్తోంది. అధికారులు శుక్రవారం 4 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.