Thursday, May 15, 2025
HomeNewsAPచంద్రబాబుకు బెయిల్ మంజూరు.. రాజమండ్రి సెంట్రల్ జైలునుండి విడుదల

చంద్రబాబుకు బెయిల్ మంజూరు.. రాజమండ్రి సెంట్రల్ జైలునుండి విడుదల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎట్టకేలకు బెయిలు మంజూరు అయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి.. 52 రోజులు జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం జైలు నుండి విడుదల అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. జైలు పరిసరాల వద్ద అభిమానులతో సందడి వాతవరణం నెలకొంది. వారిని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తనకోసం అండగా నిలిచిన అభిమానులందరికి కృతజ్ఙతలు తెలిపారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు. అక్కడినుండి అమరావతి బయలుదేరి వెళ్లారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments