తెలుగుదేశం పార్టీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నియమితులయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఎంపీ శబరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె అభిమానులు సైతం హర్హం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బైరెడ్డి శబరి తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిపై విజయం సాధించారు.