Thursday, May 15, 2025
HomeNewsAPవరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శనివారం వర్షంలో కూడా దాదాపు 3 గంటలపాటు సీఎం పర్యటన కొనసాగింది. విజయవాడలోని సింగ్ నగర్, మ్యాంగో మార్కెట్, భవానీపురం, సితార, ఎర్రకట్ట ప్రాంతాలలో ఆయన పర్యటన సాగింది. వరదభాధితుల కష్టాలను నేరుగా సీఎం తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను చంద్రబాబుకు వివరించారు. వరదలతో తమ ఇండ్లలోని సామాను, వస్తువులు, వాహనాలు దెబ్బతిన్నాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు వారికి భరోసా కల్పించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments