Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణపై విన్‌గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి
VinGroup to invest in Telangana

తెలంగాణపై విన్‌గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి

విన్‌గ్రూప్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పె ఆసక్తి కనబర్చారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను స్థాపించేందుకు విన్‌గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది.

Wingroup focus on Telangana

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి పనితీరును ఆయన ఈసంధర్బంగా అభినందించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫామ్ సాన్ చౌ తో పాటు విన్‌గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్‌లను ఆహ్వానించారు.

Also Read..| ప్రపంచ మార్కెట్‌కు గేట్‌వే ఏపీ : చంద్రబాబు నాయుడు

Share the post