ప్రధాని నరెంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆదివారం (మార్చ్ 3) భేటీ అవనుంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి వీడ్కోలు పార్టీ కూడా ఇవ్వనున్నారు. మూడవ సారి పార్టీని అధికారం లోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీ లోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్ లోని సుష్మా స్వరాజ్ భవన్లో తుది కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల లోనే లోక్సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది.