రాహుల్ గాంధీకి ఊరట.. మోడీ ఇంటిపేరు కేసులో సుప్రీం కోర్టు స్టే

ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హతకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాహుల్ పై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను క్రింది కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫైనల్ తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే వరకు రాహుల్ పై జారీ చేసిన క్రిమినల్ పరువు నష్టం దావా ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు ఆదేశించింది. ఈ తీర్పుతో రాహుల్ గాంధీ తిరిగి మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారని పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే రాహుల్ సభలో ఎంట్రీ ఇవ్వబోతోన్నారని తెలుస్తోంది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.

ఏమిటి కేసు ?

కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. దేశంలోని బ్యాంకులను మోసగించి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుల పేర్ల చివర మోడీ అని ఎందుకు ఉంటుంది.. అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టులో కేసు వేశారు.

ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రసంగించేటప్పుడు సంయమనంతో ఉండాలని సుప్రీంకోర్టు రాహుల్ కు సూచించింది. అవతలి వ్యక్తిని కించపరిచే పదాలని వాడడం మంచిది కాదని హితవు పలికింది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో గరిష్ఠంగా శిక్షను విధించడానికి గల సంతృప్తికర కారణాలను క్రింది కోర్టు వెల్లడించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ కు ఎంపీగా కొనసాగే హక్కు ఉందని, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు ఆయనను ఎన్నుకున్న ఓటర్ల హక్కును కూడా ప్రభావితం చేసేదిగా ఉందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు మధ్యంతర స్టే విధించింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img