NewsNationalRatan Tata: దివికేగిన పారిశ్రామిక దిగ్గజం.. రతన్ టాటా అస్తమయం

Ratan Tata: దివికేగిన పారిశ్రామిక దిగ్గజం.. రతన్ టాటా అస్తమయం

-

- Advertisment -spot_img

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, దేశప్రజలు నివాళులు అర్పించారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.

భారతదేశంలో అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరుగా పేరు సంపాదించారు. ఆయన నాయకత్వంలోనే టాటా గ్రూప్ అనేక విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకే ఆయన వినియోగించేవారు. కరోనా సమయంలో ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ. 1,500 కోట్లను ప్రభుత్వానికి అందించారు. ఆయన ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు.

వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలని ఆయన దృఢంగా నమ్మేవాడు. సామాజిక బాధ్యతతో ఉండేవారు. రతన్ టాటా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీల ఆవిష్కరణలను చేసేవారు. పేదవారికి తక్కువ ధరకు కారును అందించే విధంగా లక్ష రూపాయలకే నానో కారును తీసుకువచ్చారు. ముంబాయి తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అందులో పనిచేసిన సిబ్బందికి, బాధితులకు అండగా నిలిచి ఆదుకున్నాడు. ఉప్పు నుండి విమానాల వరకు అనేక వ్యాపారాల్లో టాటా తన విశిష్టతను చాటుకుంది. రతన్ టాటా చేసే వ్యాపారంలో నీతి నిబద్ధతకు పెద్దపీట వేసేవారు. ఆయన వ్యాపారాన్ని నడిపించిన తీరు, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...
- Advertisement -spot_imgspot_img

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you