Ratan Tata: దివికేగిన పారిశ్రామిక దిగ్గజం.. రతన్ టాటా అస్తమయం

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, దేశప్రజలు నివాళులు అర్పించారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.

భారతదేశంలో అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరుగా పేరు సంపాదించారు. ఆయన నాయకత్వంలోనే టాటా గ్రూప్ అనేక విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకే ఆయన వినియోగించేవారు. కరోనా సమయంలో ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ. 1,500 కోట్లను ప్రభుత్వానికి అందించారు. ఆయన ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు.

వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలని ఆయన దృఢంగా నమ్మేవాడు. సామాజిక బాధ్యతతో ఉండేవారు. రతన్ టాటా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీల ఆవిష్కరణలను చేసేవారు. పేదవారికి తక్కువ ధరకు కారును అందించే విధంగా లక్ష రూపాయలకే నానో కారును తీసుకువచ్చారు. ముంబాయి తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అందులో పనిచేసిన సిబ్బందికి, బాధితులకు అండగా నిలిచి ఆదుకున్నాడు. ఉప్పు నుండి విమానాల వరకు అనేక వ్యాపారాల్లో టాటా తన విశిష్టతను చాటుకుంది. రతన్ టాటా చేసే వ్యాపారంలో నీతి నిబద్ధతకు పెద్దపీట వేసేవారు. ఆయన వ్యాపారాన్ని నడిపించిన తీరు, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img