NewsNationalవారణాసిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నామినేషన్

వారణాసిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నామినేషన్

-

- Advertisment -spot_img

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వార‌ణాసిలో తన నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బీజేపీ పార్టీ అభ్యర్ధిగా మంగళవారం రోజున స్థానిక వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నరేంద్ర మోడీ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎన్డీఏ భాగస్వామ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. వార‌ణాసి నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన మోడీ మూడోసారి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంతకు ముందు ముందు ప్రధాని గంగాన‌దీ తీరంలో ఉన్నద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహంచారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల నడుమ ఆయ‌న గంగాహార‌తి నిర్వ‌హించారు.

దేశ ప్రజల సంక్షేమం కోసం గంగాపూజ చేసిన‌ట్లు మోడీ వెల్ల‌డించారు. మూడోసారి మోడీ ప్ర‌ధాని కావాల‌ని, భారతదేశ పేరు ప్ర‌ఖ్యాత‌లు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వెలిగి పోవాల‌ని కోరుకున్న‌ట్లు పూజారి రామ‌ణ్ తెలిపారు. అన్ని ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోడీకి ఘ‌న విజ‌యం ల‌భించాల‌ని ఆశీర్వ‌దించిన‌ట్లు మ‌రో పూజారి సంతోష్ నార‌య‌న్ తెలిపారు. ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజల త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో కొద్దిసేపు విహ‌రించారు. సోమ‌వారం రాత్రే ప్ర‌ధాని నరేంద్ర మోడీ కాశీ విశ్వేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you