NewsTelangana'ప్రగతిపథంలో ప్రజాపాలన' 80 పాటల సంకలనం పుస్తకావిష్కరణ

‘ప్రగతిపథంలో ప్రజాపాలన’ 80 పాటల సంకలనం పుస్తకావిష్కరణ

-

- Advertisment -spot_img

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని.. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువత, దళిత, బహుజన వర్గాల ఆర్థిక, సామాజిక వికాసం కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన 80 పాటల సంకలనం “ప్రగతిపథంలో ప్రజాపాలన” పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు.

Also Read | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ

ప్రజాపాలనలో అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఉచిత బస్సు పథకం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, యువకులకి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పోటీ పరీక్షల సక్రమ నిర్వహణ వంటి కార్యాచరణ ద్వారా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజా అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తోందని చెప్పారు. తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయని తెలంగాణ జీవన విధానంలో ఉన్న విశిష్టతని, ప్రజల భాషలో జానపద శైలిలో పాటల రూపంలో రూపొందిస్తూ ప్రజలందరికీ మంచి జీవన విధానం, అలవాట్ల పట్ల అవగాహనను కలిగిస్తూ, చైతన్య పరచాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you