Menu

  • Home
  • జాతీయం
  • Maha kumbh Road accident: కుంభమేళ నుంచి తిరిగి వస్తున్న హైదరబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
jabalpur road accident

Maha kumbh Road accident: కుంభమేళ నుంచి తిరిగి వస్తున్న హైదరబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కుంభమేళాకు వెళ్ళి తిరుగు ప్రమాణమైన హైదరాబాద్ వాసులు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన దుర్ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా భావిస్తున్న ఓ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న మినీ బస్సు, ఉదయం 8:15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ జిల్లా, పోలీస్ స్టేషన్ సిహోరా గ్రామం మొహ్లా మరియు బర్గి మధ్య కాలువ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు ట్రావెలర్ వాహనాన్ని ఢీకొనడంతో ఏడుగురు అక్కడక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జబల్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు.

జబల్ పూర్ అధికారులుతెలిపిన వివరాల ప్రకారం….

గాయపడిన వారి పేర్లు

  1. S.నవీనాచార్య S/o రామాచార్య 51
  2. 2. వి సంతోష్ S/o శ్రీ హరి 47

చనిపోయిన వారి పేర్లు

  1. ఆనంద్ కన్సారి
  2. శశి కాన్సారి తండ్రి త్రిభువన్ కన్సారి
  3. రవి వైశ్య విశ్వనాథన్
  4. టీవీ ప్రసాద్
  5. మల్లారెడ్డి
  6. బాలకృష్ణ శ్రీ రామ్
  7. రాజు
Share the post

Also Read..