Wednesday, June 18, 2025
HomeNewsNationalకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు..!

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం.7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది. ఇంతకు ముందు అక్టోబర్ 2023లో చివరిసారిగా డీఏను నాలుగు శాతం పెంచారు, దీంతో అది 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. మార్చిలో డీఏ పెంపు 4 శాతం మేర ప్రకటించినట్లయితే డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరగనుంది. 2024 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే కాలానికి ఇది వర్తించనుంది. దీనిని ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments