Sunday, May 18, 2025
HomeNewsNationalCOVID: భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

COVID: భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

భారత్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి..దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,049 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. JN.1 సబ్ వేరియంట్‌ కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది..మరోవైపు, దేశవ్యాప్తంగా మరణాలు సంఖ్య కూడా క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. అంతేకాదు, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ మరింత విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు..

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments