Saturday, April 19, 2025
HomeNewsTelanganaసమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయాలి.. అధికారుల సమీక్షలో సీఎస్

సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయాలి.. అధికారుల సమీక్షలో సీఎస్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేని విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై గురువారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటి తో పూర్తవుతుందని అన్నారు. ఈ నెల 9 నుండి అసలు సర్వే ప్రారంభం అవుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలను కంప్యూటరైజ్డు చేయడానికి సు శిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. దేశంలోనే మెట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలాగా ప్రతీ రోజూ ప్రజలను ఛైతన్య పరిచేలా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఏ ఇంటిని కూడా వదలకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అన్నారు.

Also Read.. | RajBhavan: కులగణనపై గవర్నర్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments