అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆహ్వానం అందింది. హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ రాజకీయ నాయకుడు బండారు దత్తాత్రేయ స్వయంగా ఆహ్వానించారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి అక్టోబర్ 3న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనుంది.
శనివారం బండారు దత్తాత్రేయ స్పీకర్ ను హైదరాబాద్ లోని ఆయన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ అలయ్ బలయ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ వేడుకలో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు.










