Delhi CM: ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా.. ముఖ్యమంత్రిగా అతిషి

ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు (Vinai Kumar Saxena) అందించారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసేవరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్ం ఆప్ ప్రభుత్వాన్నిరాజకీయంగా ఎదుర్కోలేక, దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నారని గతం నుండి కేజ్రీవాల్ చెప్తూ వస్తున్నారు. ఆరు నెలలు జైలులో ఉన్నతర్వాత ఇటీవల ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇటీవల జరిగిన మీటింగ్ లో తాను మాట్లాడుతూ.. తాను నిర్దోషి అని ప్రజలు నమ్ముతేనే తమ పార్టీకి ఓటు వేయండని.. లేకుంటే ఓటు వేయకండని ప్రజలను కోరారు. అప్పటివరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని ఆయన ఢిల్లీ ప్రజలకు తెలిపారు. ఈమేరకు రెండు రోజుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం తన పదవకి రాజీనామా చేశారు.

అంతకు ముందు ఢిల్లీ నూతన సీఎంగా ప్రస్తుత విద్యాశాఖా మంత్రి అతిషి మార్లేనా సింగ్ (Atishi marlena singh)పేరును ఆమ్ ఆద్మీపార్టీ ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అతిషి పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. ముఖ్యమంత్రి పదవికోసం పార్టీలో పలువురు పోటీపడ్డారు. అయినా చివరకు అతిషి పేరుకు శాసనసభాపక్షం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. కేజ్రీవాల్ జైలులో ఉన్నసమయంలో పరిపాలన కుంటుపడకుండా అతిషి చూశారు. పార్టీ కార్యక్రమాలను సైతం దగ్గరుండి పర్యవేక్షించారు. ఢీల్లీ ప్రభుత్వంలో ఆమె ప్రస్తుతం విద్య, పి.డబ్ల్యూ.డి, సంస్కృతిక పర్యాటక శాఖల మంత్రిగా పని చేస్తున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img