Menu

  • Home
  • జాతీయం
  • Jashn-e-Adab: హైదరాబాద్ లో జాష్న్-ఎ-అదాబ్ సాహిత్యోత్సవ్ వేడుకలు
Image

Jashn-e-Adab: హైదరాబాద్ లో జాష్న్-ఎ-అదాబ్ సాహిత్యోత్సవ్ వేడుకలు

జష్న్-ఏ-అదాబ్ సాహిత్యోత్సవ్ కల్చరల్ కారవాన్ వేడుకలు ఆగస్టు 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. హైదారాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU)లో ఈ వేడుకలను నిర్వహించారు. ముందుగా యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఆనుల్ హసన్, అజ్మ్ షాకిరీలతో ‘డెక్కనీ ఉర్దూ మే ఫార్సీ కే అస్రాత్‘పై సంభాషణ, ‘కులీ కుతుబ్ షా, హైదరాబాద్, ఔర్ దక్కనీ అదాబ్,’ దస్తాంగోయ్‌పై చర్చాగోష్టి డెక్కనీ షేరీ మెహఫిల్ ప్రదర్శన, డాక్టర్ విద్యా షా సంగీత ప్రదర్శన కవ్వాలీ ప్రదర్శనలు మొదటిరోజు నిర్వహించారు.

రెండవ రోజు ఉర్దూ పొయెట్రీతో ప్రారంభమయి.. డాక్టర్ మమతా జోషి బృందంచే సూఫీ గానం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. జాతీయ అవార్డు గ్రహీత కూచిపూడి నృత్యకారిణి యామిని రెడ్డి నృత్య ప్రదర్శన, ‘ సినిమా OTT ఆండ్ ధియేటర్ – సామాజిక్ సరోకార్ యా మనోరంజన్ ‘ అంశంపై ప్రముఖ జర్నలిస్టు సంకేత్ ఉపాద్యాయ చర్చ నిర్వహించారు. ఈ చర్చా గోష్టిలో బాలీవుడ్ నటులు అమిత్ సియల్, మను రిషిచడ్డా, ప్రొడ్యూసర్ ఫైసల్ మాలిక్ లు పాల్గొన్నారు. చివరగా ఉర్దూ, హిందీ భాషల్లో కవిసమ్మేళనం నిర్వహించారు.

Share the post

Also Read..