తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (TDP) క్రియాశీలకంగా పుంజుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సైకిల్ పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాజకీయాలనుండి కనబడకుండా పోయింది. గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనిపించడంలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. 2014 తర్వాత తెలుగుదేశంలో ఉన్నతెలంగాణ కీలక నేతలు కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఆంధ్రప్రదేశ్ లో ఆపార్టీ అధికారం చేజిక్కిచుకున్నా.. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తాజాగా అధిష్టానం తెలంగాణలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
2024 ఎన్నకల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలను కలుపుకొని కూటిమిగా ఏర్పడి అనూహ్య విజయం సాధించింది. అక్కడ కూటమి ఫార్ములా సక్సస్ కావడంతో తెలంగాణలో కూడా అదే కూటమి కాంబినేషన్ లో పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తుందట. తెలంగాణలో గతంలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధికారాన్ని దశాబ్దాలపాటు చెలాయించారు. టీడీపీ ఏర్పాటు తర్వాత అనచివేతకు గురైన బీసీ కులాల్ని ప్రోత్సాహించారు. చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. చాలామంది మంత్రులు కూడా అయ్యారు. తెలంగాణలో బీసీల్లో చైతన్యం రావడానికి తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ఉపయోగపడిందని ఇప్పడికీ ఇక్కడి నేతలు చెప్పుకుంటారు.
తెలంగాణ ఉద్యమసమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని ఎంచుకొని.. తనకు రెండు ప్రాంతాలు సమానమని ప్రకచించినా ఆయనపై తెలంగాణ వ్యతిరేఖిగా బీఆర్ఎస్ పార్టీ ముద్ర వేసింది. దీంతో టీడీపీ తెలంగాణలో మరింత బలహీనపడింది. ఇదంతా గతం.. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది.. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పగలిగిన స్థాయిలో ఉండడంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సరైన సమయం ఇదేనని పార్టీ పెద్దలు భావిస్తున్నారట.
తెలంగాణలో బీజీపీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. పవణ్ కళ్యాణ్ కు తెలంగాణలో కూడా ఫాలోయింగ్ ఉంది. అదీకాకుండా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న బలమైన బీసీ నాయకులను తమవైపు తిప్పుకోవాలని టీడీపీ చూస్తుందట. కులగణన సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీలోని నేతలే ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు. అలాంటి నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ఇప్పటికే గ్రన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. తద్వారా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని మరోసారి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట సైకిల్ పార్టీ పెద్దలు. వచ్చే GHMC ఎన్నికల్లోనే రీఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తమ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.