పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy), ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (arekapudi gandhi)ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకే ఆంధ్రా, తెలంగాణ అంటూ మాట్లాడుతున్నారని అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తన ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారని, కానీ ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చే వ్యక్తితో తాను కలిస్తే తాను కూడా కౌశిక్ రెడ్డి లాంటి వాడినని సమాజం భావిస్తుందన్నారు. అయినప్పటికీ ఆయనను ఇంటికి ఆహ్వానించానని, కానీ ఆయన రాలేదని అన్నారు. తానే స్వయంగా అతని ఇంటికి వెళితే దాడి చేశారని ఆరోపిస్తున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకోని రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చానని.. జూనియర్ ఎమ్మెల్యే తనలాంటి సీనియర్ ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. తనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌లోయ ఇతర నాయకులే లేరా? అని ప్రశ్నించారు. తనతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డికి కొత్తగా పదవి ఇచ్చిందా? అని ఎద్దేవా చేశారు. గతంలో గవర్నర్ పైన చేసిన వ్యాఖ్యలు.. నిన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పడ్డారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అరికెపూడి గాంధీయే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడాడని.. తాను సెటిలర్లను కించపరిచినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో కూల్చివేతలతో నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పని చేస్తుందని మండిపడ్డారు. ఇక నుండి రేవంత్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img