కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు.గత రెండు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. నియంతృత్వ నిజాం నుండి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించిన రోజు ఈరోజు అని అన్నారు. వేలాది మంది ప్రజలు చేసిన వీరోచిత పోరాటాలు, అనేక త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు.

దేశానికంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. మన తెలంగాణ రాష్ట్రానికి 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. నిజాం నవాబు పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు.నిజాం సైన్యం,రజాకార్లు గ్రామాల్లోకి వెళ్లి స్త్రీల మీద అత్యాచారాలు, లూటీలు చేసి అరాచకాలకు పాల్పడ్డారన్నారు. భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టి, నిజాం సైన్యాన్ని ఓడించి, తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేశారని అన్నారు. నేటి సెప్టెంబరు 17 చాలా ప్రత్యేకమైనదని అన్నారు. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం అన్నీ ఒకే రోజు జరుపుకుకుంటున్నామని, అందుకే ఈరోజు పవిత్రమైన రోజు అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ.. దివాళాకోరు రాజకీయాలతో తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా తెలంగాణ ప్రజలను ఈపార్టీలు మోసం చేస్తున్నాయని ద్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చర్యలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కిషన్ రెడ్డి కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img