Monday, March 24, 2025
HomeNewsAPముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ప్రజా భవన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈసమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్టీసీ, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments