Thursday, May 15, 2025
HomeNewsTelanganaకులవృత్తులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమే… రెండో విడత గొర్రెల పంపిణీలోమంత్రి శ్రీనివాస్ గౌడ్

కులవృత్తులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమే… రెండో విడత గొర్రెల పంపిణీలోమంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో కురుమ, యాదవుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్నిదేశమంతా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని జైనల్లీపూర్, కోడూరు, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 18 యూనిట్ల గొర్రెలను అందించారు.


ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులవృత్తులను ఆదుకున్నది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి అన్నారు. అన్నికులవృత్తులను ప్రోత్సహించి, కుల వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకవచ్చి స్థానికంగా విక్రయించే వారని అన్నారు. ఉచిత గొర్రెల పంపిణీ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత స్థానికంగానే గొర్రెల పశు సంపద భారీగా పెరిగిందని అన్నారు. కురుమ, యాదవుల జీవితాల్లో కేసీఆర్ గొప్ప మార్పును తీసుకువచ్చారని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాలలోని పేదలకు కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అందించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత 24 గంటల విద్యుత్తు, తదితర పథకాలతో సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారంతా ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించాలని కోరారు. గతానికి నేటికీ తేడాను గమనించాలని మంత్రి అన్నారు. సంక్షేమ పథకాలు అంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటే ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నేతలు ఈ పథకాలను ఎలాగైనా తీసివేయాలనే కుట్రతో ప్రజల మద్య విద్వేషాలు రాజేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అభివృద్ధి విఘాతకుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments