Thursday, May 15, 2025
HomeNewsTelanganaతెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: రాణి రుద్రమ

తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: రాణి రుద్రమ

తెలంగాణలో బడిబాట మొదలైంది కానీ బడికి మంత్రి లేడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రభుత్వాన్ని విమర్శించారు. మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ.. విద్యకు మంత్రి వద్దా.. అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయినా.. పాఠ్య పుస్తకాలపైన పాత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయని విద్యార్థులు చూసి చెప్పేవరకు ఇవి బయటకు రాని పరిస్థితి ఉందని అన్నారు. వద్యాశాఖపై పర్యవేక్షణ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనడనికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాని ఆమె ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ప్రతి జిల్లాకు DEO ఉండాలి.. కానీ 26 జిల్లాలకు DEO లు లేరుని తెలిపారు. 62 డెప్యూటీ EO పోస్టులకు ఒక్కరు కూడా డ్యూటీ లో లేరన్నారు. 617 మండలకు MEO ఉండాలి కానీ.. కేవలం 17 మంది మాత్రమే MEO లు ఉన్నారని, 598 మండలకు MEO లు లేరుని లెక్కలతో వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగేందుకు స్కావెంజర్లు లేక దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే లేరని విమర్శించారు. విద్యాశాఖను పర్యవేక్షణ చేసే టైం సీఎం రేవంత్ రెడ్డి వద్ద లేకపోతే ఎందుకు ఆశాఖను ఆయన దగ్గర పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కు ఏం చేసాడు అంటే.. గాడిద గుడ్డు చేసాడని ఆరోపించారు.
వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్ష అభియాన్ నిధులు పూర్తిగా వాడి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాణిరుద్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments