Saturday, May 17, 2025
HomeNewsTelanganaతెలంగాణ హిస్టరీ, ఫ్యూచర్ కేసీఆరే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ హిస్టరీ, ఫ్యూచర్ కేసీఆరే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ రెండు కూడా బీఆర్ఎస్ అధినేత, కేసీఆరే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను స్టేట్ ఫ్యూచర్ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారూ…. రాసి పెట్టుకోండి.. తెలంగాణ హిస్టరీ కెసిఆర్. తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆర్ యే. కెసిఆర్ గారికి మీరు ఏ రకంగానూ సరితూగరు.” అని అన్నారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… తమకు తెలంగాణ అంటే టాస్క్ అని, ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయం అని తెలిపారు. కెసిఆర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నిద్రలో కూడా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారని అన్నారు. “రైతుబంధు ఇవ్వను కానీ రఫ్ గా మాట్లాడుతా, రుణమాఫీ చెయ్యను కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లు అన్నీ చెబుతా, ఉద్యోగాలు ఇవ్వను కానీ ఉట్టి మాటలు చెబుతా, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వను కానీ తుఫెల్ మాటలు చెబుతాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ” అని ఎద్దేవా చేశారు. గౌరవ మర్యాదలు అనేటివి కొనుక్కుంటే వచ్చేవి కావని, మన నడవడిక, మాటతీరు, పని పేరు బట్టి ఉంటుందని చెప్పారు.

Also Read.. | ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్

కెసిఆర్ గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో అని ప్రజలు టీవీలను ఆన్ చేస్తారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు టీవీని మ్యూట్ చేసే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ముందుగానే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి ఏ సర్టిఫికెట్ తీసుకొని వినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపాన్ని మూట కట్టుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.

రంజాన్ తోఫాలు ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో మసీదుకు రూ. లక్షా ఇచ్చే వాళ్ళమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింల వైపున ఏ పార్టీ నిలుస్తుందో దీన్ని బట్టి తేటతెల్లమైందని తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments