Friday, May 16, 2025
HomeNewsTelanganaTelangana Budget: 3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Telangana Budget: 3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం యదాతథంగా..

గౌరవ అధ్యక్షా….

ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. సంక్షేమం-అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను.

డా. బాబా సాహెబ్ అంటేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నారు. అందుకే, రాజ్యాంగ నైతికతను [Constitutional Morality) ఆయన పదేపదే నొక్కిచెప్పారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ, మా ప్రజాపాలన సాగిస్తున్నాం.

తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని, మేం ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా, ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ, మార్పు తెచ్చే బాధ్యతగా భావిస్తూ, వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ, విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం. దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్ధిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థలని గాడిలో పెడుతూ, తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని, మా ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నది.

“నిజం కూడా ప్రతి రోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది”.

ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి కువిమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే, స్వార్ధపరులు ప్రచారం చేసే అబద్ధాలే
నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, ప్రజలకందించేందుకుగాను, సాగుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమాలను ముందుకు

అభివృద్ధి. సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా, నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది. అయితే, అదే సమయంలో లోక్ సభఎన్నికలు రావడంతో, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో “తెలంగాణ రైజింగ్ 2050” అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు. రాబోయే పదేళ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్ (ట్రిలియన్-డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది.

హైదరాబాద్ మహా నగరంలో రవాణా, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నాం. దీనిలో భాగంగా హైదరాబాద్ ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నదీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ను ప్రారంభించాం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ. సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు “మెగా మాస్టర్ ప్లాన్ 2050″ని రూపొందించాం. దీని కోసం సౌర, పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం.

ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేసాం.

సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు, డిజిటల్ విద్యను పెంపొందించి, పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం. వెనుకబడిన వర్గాలకు చెందిన
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లను అందిస్తున్నాం.

రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలి حد అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, ప్రత్యేక ఇన్సెంటివ్ లను అందిస్తుంది. మార్కెట్లో సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మార్కెట్ యార్డుల్లో రైతుల కోసం అనేక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం.

“నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో” -మహాత్మగాంది వారి మాటలే మాకు స్ఫూర్తి మంత్రం. నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం మేము తీసుకున్న ప్రతి చర్య వెనుక ఉన్న ఆలోచన ఇదే. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు తగినన్ని నిధులను ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం.

రాష్ట్ర ఆర్థిక స్థితి:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం, పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు (16,12,579 కోట్లు). గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో, దేశ GDP మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు (3,31,03,215 కోట్లు) కాగా, వృద్ధిరేటు 9.9 శాతంగా ఉంది.

తలసరి ఆదాయం:

2024-25 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక రూపాయలు (రూ.3,79,751) కాగా, వృద్ధి రేటు 9.6 శాతం. దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదువేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు (రూ.2,05,579) కాగా వృద్ధి రేటు 8.8 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం

ఒక లక్షా డెబ్బై నాలుగు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలు (5.1,74,172), ໙໖ 1.8 2 2 ໖.

వివిధ రంగాలలో వృద్ది రేటు:

2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో (GSVA) సేవా రంగం 66.3 శాతం, పారిశ్రామిక రంగం 16.4 శాతం, మరియు వ్యవసాయ, అనుబంధ రంగాలు 17.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

వ్యవసాయ, అనుబంధ రంగాలు GSDP లో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో 42.7 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉచిత కరెంట్, రైతు భరోసా, పంట రుణ మాఫీ, నీటి పారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకుగాను, పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం.

రాష్ట్ర పరిశ్రమలు 22.5 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. “చైనా +1” వ్యూహాన్ని అవలంభించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.

పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా, ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది.

రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక క్రొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతోంది. ఇది మొత్తం శ్రామిక రంగంలో 34.8 శాతం వాటాను కలిగి ఉంది. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు, ఫిస్టిక్, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతోంది.

తెలంగాణ లో శ్రామికశక్తి 68.7 శాతం ఉండగా, దేశీయ సగటు 64.3 శాతం మాత్రమే ఉంది. దీనిలో, మహిళల ఉపాధి శాతం 52.7 శాతం ఉండగా, ఇది దేశ సగటు 45.2 శాతం కంటే అధికం. మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమయ్యిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

16వ ఆర్థిక సంఘం

రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఇందులో కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగే రుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమీషన్ కు వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది.

తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే, 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని మరింత హేతుబద్దంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న “తలసరి ఆదాయ దూరం” అనే ప్రాతిపదిక ప్రాధాన్యతను తగ్గించి, GSDP కి 50 శాతం వెయిటేజిని ఇవ్వాలని కోరింది. దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా సహకరి 10/72] మరింత హేతుబద్ధంగా వనరులను అందించడం ద్వారా దేశ అభివృద్ధి~ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించబడింది. మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు, ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని, ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

అభయహస్తం:

మేము ప్రవేశపెట్టిన అభయ హస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకొన్నవే. ఒక నిరుపేద తన రోజువారి జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత క్రింద పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్ధవంతంగా అమలు చేస్తోంది.

మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకోవడానికి బడికి వెళ్లాలన్నా లేదా మొక్కు తీర్చుకోవడానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్లడానికి, మహాలక్ష్మి పథకం క్రింద 2023, డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకు 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మ దీని ద్వారా ఐదు వేల ఐదు కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయలు (5005.95 కోట్లు) మహిళలకు ఆదా అయ్యింది. ప్రారంభ దశలో సాధారణ బస్సులలో 69 శాతంగా ఉన్న RTC ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగింది. మహాలక్ష్మి ప్రత్యేక బస్సులలో ఈ ఆక్యుపెన్సీ రేషియో 100 శాతంగా నమోదవుతూ ఉంది. దీనివల్ల RTC ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు, RTC కి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్దిచేకూరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ క్రింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు (433.20 కోట్లు) చెల్లించింది.

గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. ఈ పథకం క్రింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల పదిహేను లక్షల రూపాయలు (1,775.15 కోట్లు) విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా చెల్లించడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2024, మార్చి నెలలో ప్రారంభించి, ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల (4,50,000) ఇండ్లను మంజూరు చేస్తాం.

గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశ నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలబై ఐదు (34,545) నిర్మాణాలకు, మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల (305.03 కోట్లు) నిధులను కేటాయించి, వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతే కాకుండా, ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేసి, అల్పాదాయ మరియు మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం.

రాష్ట్రం లోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని చేయూతలో భాగంగా అమలు చేస్తున్నాం. ఈ పథకం క్రింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడంవల్ల దారిద్య్రరేఖకు దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను కూడా 20 శాతం పెంచాం. అదనంగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకు రావడంతో, 1,835 వైద్య పరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

వ్యవసాయం రంగం:
రైతు రుణ మాఫీ:

పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది.
మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణ విముక్తులను చేసింది. వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనబై తొమ్మిది లక్షలు (20,616.89 కోట్లు) రుణ మాఫీ చేసాం. దీనివల్ల రైతులు మళ్ళీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైంది. ఈ భారీ రుణ మాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం.

రైతు భరోసా:

రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు, పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025, జనవరి 26 తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం క్రింద రైతులకు ఏడాదికి, ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయి.

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి, గ్రామ సభలలో ధృవీకరించి, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించడం ద్వారా, ఈ వృధాను అరికట్టాము. రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల (18,000 కోట్లు) రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (రైతు కూలీ సంక్షేమం):

భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీన స్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12 వేల రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం.

సన్న వడ్లకు రూ.500 బోనస్:

రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చినప్పుడు, సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివరి వడ్లగింది కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా, రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్ లో సన్నవడ్లు పండించిన రైతులకు, పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు (1,206.44 కోట్లు) బోనస్ చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్ధం 2024-25 ఖరీఫ్ సీజన్ లో 8,332 దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసాం.

అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా, గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అదునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డులలో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాము.

2024-25 ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు (10.35,484) మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు (12,511.76 కోట్లు) వారి ఖాతాలలో జమ చేయడమైనది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం అన్ని చర్యలు తీసుకొంటున్నాము.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో, ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులకి సరైన ధర లభించనందున, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలా కృషి చేసాం. తద్వారా, ఆయిల్ పామ్ రైతులకు, టన్నుకు 2,000 రూపాయలు అదనపు లబ్ది చేకూరి. ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను, ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం.

వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో 24,439 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము.

పశుసంవర్ధక రంగం:

పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్, శాంతినగర్ లో ఉంది. ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి, 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా, క్రొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం. 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్ లు, ఆర్ అండ్ డి. యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు, స్టాప్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం.

మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కొహెడలో ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ హోల్ సీల్ చేపల మార్కెట్ ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం.

రాష్ట్రంలో మేలు జాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి లో ఒక కొత్త ఫ్రోజెన్ సిమన్ బుల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయల (21.06 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్నాం. దీనిని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ఫ్రోజెన్ సెమన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. పశు సంవర్ధక శాఖకు ఈ బడ్జెట్ లో 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

భూభారతి:

భూమి అనేది ఒక స్థిరాస్థి మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్న తల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. అటువంటి, భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, ప్రజలు చేసుకున్న ధరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది. వీటి పరిష్కరణను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్/ఆర్.డి.ఓలకు బదిలీ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసాం.

తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, భూ భారతి లావాదేవీలను సులభతరం చేసి, సక్రమమైన భూ రికార్డ్ వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. భూ పరిపాలనను
మరింత బలోపేతం చేయడానికి, 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టులను మంజూరు చేసాం. దీనితో, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రను పునరుద్ధరించి, భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్ధవంతమైన పాలనావ్యవస్థను తెస్తున్నాం..

నూతన రేషన్ కార్డుల జారీ:

తెలంగాణ అవతరించిన తరువాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. నూతన రేషన్ కార్డుల జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం.పౌర సరఫరాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

విద్య:

యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్:

విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా, పేద మరియు వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లల సురక్షిత భవిష్యత్తుకి విద్య ఒక దారిని చూపుతుంది.

ఇది ప్రగాఢంగా నమ్మిన UPA చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ఆనాటి భారత ప్రధాని దివంగత డా. మన్మోహన్ సింగ్ గార్ల నాయకత్వంలో ఉచిత విద్యా హక్కు చట్టం 2009 లో చేసారు.

ప్రస్తుతం తెలంగాణలో 1,023 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, వీటిలో 662 పాఠశాలలకు స్వంత భవనాలు లేవు. అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలున్న భవనాల్లో, వందలాది మంది విద్యార్థులతో, సరైన టాయిలెట్ సదుపాయం కూడా లేకుండా నడుస్తున్నాయి. వర్గాల వారీగా ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ, వాటి మధ్య విద్యా ప్రమాణాల విషయంలో, మౌలిక వసతుల విషయంలో సారుప్యత లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, మన ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాల కాలం వెనుకబడి ఉన్నాయి.

పరిస్థితులను సరిదిద్దడానికి సామాజికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి, మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా, విద్య మాత్రమే కాకుండా, విద్యార్ధుల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విదంగా ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాఠశాలలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తెచ్చి సమాన విద్యా అవకాశాలను కల్పించడం, ఒక గొప్ప సామాజిక ఐక్యతకు పునాది అవుతుంది.

“Education is the milk of a lioness. The one who drinks it, can’t stay without roaring” Dr. B.R. Ambedkar. విద్య అనేది సింహపు పాల వంటిది, వాటిని త్రాగిన వాడు గర్జించకుండా ఉండలేరు. డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను మేము సృష్టించబోతున్నాము. దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయల అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మేము తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రారంభిస్తాం.

ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడతాయి. విద్యారంగంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా, ఆధునిక వసతులతో ప్రైవేట్ పాఠశాలలకు దీటైన విద్యను అందించేందుకు వీటిని అభివృద్ధి చేస్తున్నాం. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్ మరియు ఫుట్బాల్ గ్రౌండ్స్ లాంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల నిరంతర పర్యవేక్షణకు వీలుగా ఈ పాఠశాలల ప్రాంగణాల్లోనే బోధనా సిబ్బందికి నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూళ్లలో పవన మరియు సౌరశక్తిని విరివిగా వినియోగిస్తాం.

ఈ స్కూళ్లలోని విద్యార్థులకు వసతి, భోజనం, యూనిఫాంలు, నోటు మరియు పాఠ్య పుస్తకాలు మరియు ఇతర ఆవశ్యక వస్తువులన్నీ ఉచితంగా అందించబడతాయి. పాఠ్యాంశంతో పాటు వీరికి IIT-JEE, NEET మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యతో పాటు శారీరక మరియు మానసిక దృఢత్వానికి అవసరమైన క్రీడలు, కళలు, పోటీలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్ధులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ ను అందజేస్తున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరాని అందిస్తున్నాం. త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ ని అందిస్తాం.

పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి, సంతులిత పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి, రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, అన్ని సంక్షేమ శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలలో, డైట్ చార్జీలు 40 శాతం మరియు కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచాం. ఈ పెంపు వల్ల తెలంగాణ వ్యాప్తంగా 7.66 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఇస్తున్నాం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments