NewsTelanganaరైతన్నరాజ్యస్థాపన కోసం ఖమ్మం బరిలో రైతుబిడ్డ సిరాజ్

రైతన్నరాజ్యస్థాపన కోసం ఖమ్మం బరిలో రైతుబిడ్డ సిరాజ్

-

- Advertisment -spot_img

రైతన్న రాజ్యస్థాపన కోసం ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగానని రైతుబిడ్డ సిరాజ్ తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా షేక్ సిరాజుద్దీన్ మంగళవారం రోజున నామినేషన్ దాఖలు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు ఇవ్వలేని పరిస్థితి తనది అని తెలిపారు. కనీసం గిఫ్ట్ లు, బిర్యానీలు, చుక్క, ముక్క ఇచ్చే స్థోమత తనకు లేదన్నారు. ఓటు కంటే నోటు ఫవర్ ఫుల్ గా తయారైందన్నారు. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రోజున సిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు.

రైతుల ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయం అంతరించే ప్రమాదంలో పడిందన్నారు. నేలను నమ్ముకున్న రైతన్నకు మన దేశంలో స్వతంత్రం ఇంకా రాలేదు అని అన్నారు. రైతన్న పేరు చెప్పి రాజకీయం చేసినోడికి పదవులోస్తున్నాయి. రైతన్నపేరుతో సినిమాలు తీసినోడికేమో కోట్లు, హిట్లు వస్తున్నాయి. కానీ, నిజమైన రైతన్నలు వ్యవసాయం చేస్తుంటే అప్పులు ఎందుకు వస్తున్నాయి. ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి అని ప్రశ్నించారు. మార్పు కోసం.. ఈ వ్యవస్థను మార్చడం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కొత్త మార్పు రావాలన్నా.. రైతన్న రాజ్యం రావాలన్నా.. తనకు ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టు అని అన్నారు.. తన గెలుపు రైతన్న రాజ్యానికి మొదటి మొట్టు అని సిరాజ్ అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you