Chandramohan: ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్ర మోహన్ కు బార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రమోహన్ అసలుపేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా లోని పమిడిముక్కల గ్రామంలో 1945, మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో విద్యాభ్యాసం జరిగిగింది. చంద్ర మోహన్ బార్య పేరు జలంధర్, రచయిత్రిగా సుపరిచితురాలు. కూతురు మధుర మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ గా అక్కడే స్థిరపడ్డారు. మరో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తున్నారు.

చంద్రమోహన్ 1966 లో రంగుల రాట్నం సినిమాతో సినిమాల్లోకి వచ్చారు.ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలతో రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, సీతామహాలక్ష్మి, చందమామ రావే సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 932 సినిమాలలో నటించారు. ఒకానొక సమయంలో చంద్ర మోహన్ తో సినిమా అంటే హిట్ అనే పరిస్థితి ఉండేది. చంద్ర మోహన్ తో జయప్రదకు సిరిసిరి మువ్వ, శ్రీదేవికి పదహారెళ్ళ వయసు సినిమాలు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాయి. చంద్రమోహన్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల్లో నటించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img