సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్ సహా పలువురి అరెస్ట్

భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, ప్రజాకవి జయరాజ్, ప్రముఖ రచయిత జూపాక సుభద్ర లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వేచ్ఛ జేఏసీ సారథ్యంలో సైఫాబాద్ అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లోని సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం వీరందరూ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అమెరికా లాంటి దేశాలలో ప్రతి ముగ్గురిలో ఒకరు మతంపై నమ్మకం లేని వారున్నారని.. మన దేశంలో కూడా మతం పై నమ్మకంలేని వారి సంఖ్య నాలుగు శాతం పెరిగిందని సతీష్ చందర్ తెలిపారు. మనుస్మృతిలో శూద్రులను కించపరిచేలా రచనలు ఉన్నాయన్నారు. శూద్రులు, పంచములు, స్త్రీలపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. అలాంటి సాంప్రదాయాన్నిగౌతమ బుద్ధుడు ఎడమ కాలితో తొక్కొపడేశాడని.. అసమ, వర్ణ వ్యవస్థ మీద తిరుగు బాటు చేశాడని గుర్తు చేశారు. అంబేద్కర్ బుద్దుడి గురించి మాట్లాడుతూ ” స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ” అని ఫ్రెంచ్ విప్లవ సందేశాలని మనం ఇప్పుడు మాట్లాడుతున్నామని.. కానీ బౌద్ధ చక్రవర్తులు తమ భావనలతో ఈ వర్ణ వ్యవస్థ పైన శూలం దింపారన్న అంబేద్కర్ మాటలను సతీష్ చందర్ గుర్తు చేశారు.

గత 15 సంవత్సరాలుగా సతీష్ చందర్, కత్తి పద్మారావు లాంటి వారు తమ రచనల ద్వారా పోరాటం చేస్తూనే ఉన్నారని ప్రజాకవి జయరాజ్ అన్నారు. జైభీమ్ అన్నోడే నేడు దేవాలయాలపై పాటలు పాడుతున్నారని అన్నారు. దేశంలో బహుజన వర్గాలను అందర్నీ ఏకతాటి పైకి తెచ్చి, మా ఓటు మాకే అనే వాతావరణం వచ్చిందనుకున్న తరుణంలో వారు కూడా మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని అములు చేస్తున్నప్పుడే స్వేచ్ఛ జేఏసీ ఏర్పడిందని జయరాజ్ అన్నారు.

భారత రాజ్యాంగాన్నిముందుంచి మనువాదాన్నిపక్కకు నెట్టివేసినా కూడా ఇంకా ఇంకా మనువాద ధోరణులే అమలు అవుతున్నాయని ప్రముఖ దళితవాద రచయిత జూపాక సుభద్ర తెలిపారు. రాజ్యాంగం అమలులోనికి వచ్చి దాదాపు 75 సంవత్సరాల తరువాత కూడా దాని అమలు సరిగా జరగడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని GHMC పారిశుద్య కార్మికులలో ఒకరు కూడా అగ్ర కులానికి చెందిన మహిళలు ఎందుకు లేరని జూపాక సుభద్ర ప్రశ్నించారు. దళత మహిళలు నేటికీ అవమానాలకు గురవుతున్నారని.. గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు, జోగినీ వ్యవస్థ వంటి దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. వారికి అవమానాలే ఎదురవుతున్నాయని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img