NewsTelanganaఆర్టీసీ కురు వృద్ధుడు నరసింహా ఇకలేరు

ఆర్టీసీ కురు వృద్ధుడు నరసింహా ఇకలేరు

-

- Advertisment -spot_img

నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహా గారు మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. #Hyderabad ఓల్డ్‌ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

గత ఏడాది స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎల్‌ నరసింహ గారిని #TSRTC ఘనంగా సన్మానించింది. బస్‌భవన్‌లో జెండా పండగకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సంస్థ సత్కరించింది.


వజ్రోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ట్యాంక్‌ బండ్‌పై చేపట్టిన ర్యాలీని నరసింహ గారే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో తన అనుభవాలను నాతో పంచుకున్నారు. సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారు. టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి సలహాలు కూడా ఇచ్చారు.

ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో సేవచేసిన ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా గారు మరణించడం బాధాకరం. టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నరసింహా కుటుంబ సభ్యులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, హైదరాబాద్‌ శివారు బొల్లారంలో టీఎల్ నరసింహా గారు 1925లో జన్మించారు. 1944లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన.. చివరగా రూ. 1,740 వేతనం అందుకొని రిటైరయ్యారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you