Wednesday, May 14, 2025
HomeNewsTelanganaRevanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ తో బేటీ

Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ తో బేటీ

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెల్లిన భట్టి, ఉత్తమ్ లతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలపనున్నారు. వరంగల్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కాగానే వరంగల్ లోనే భారీ భహిరంగ సభ నిర్వహిచనున్నారు. ఈ సభకు రాహుల్ ను ఆహ్వానించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత బహిరగ సభకు ఒక తేదీని ఫిక్స్ చేయనున్నారు.

అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ అధ్యక్ష పదవి, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటడ్ పదవుల నియామకం పూర్తి కాగా, మరికొన్నింటిపై కసరత్తు చేయనున్నారు. పదవులు దక్కని సీనియర్లను ఏవిధంగా గౌరవించాలనే దానిపై కూడా చర్చించనున్నారు.

కేబినెట్ లోకి వీరికి అవకాశం..!

నిజామాబాద్ నుండి సుదర్శన్, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీనివాస్ లేదా వీర్లపల్లి శంకర్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని.. నల్గొండ నుండి బీర్ల అయిలయ్య, బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని.. రంగారెడ్డి నుండి మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కేంద్రమంత్రులతో భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలస్తోంది. రాష్టానికి సంబందిచి పలు సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments