Tuesday, April 22, 2025
HomeNewsTelanganaతెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారథి పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఆయన పదవీకాలాన్ని పొడగిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాణి కుముదిని ఐఏఎస్ ను కమీషనర్ గా రేవంత్ ప్రభుత్వం నియమించింది. కుముదిని 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. అధికారిణి. ఆమె గతంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆమెను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే, 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను అదే హోదాలో కొనసాగించింది. రేవంత్ సర్కార్ ఆమెకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, ఇతర స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ కొత్త కమిషనర్‌కు సవాల్‌గా మారనుంది

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments