NewsTelanganaధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్

-

- Advertisment -spot_img

తెలంగాణలో ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది.పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా రంగారెడ్డి తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో సంగారెడ్డి ఉంది. నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి, ఆరో స్థానంలో నల్గొండ, ఏడో స్థానంలో మహబూబ్ నగర్, ఎనిమిదో స్థానంలో మెదక్, తొమ్మిదో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం, పదో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఎకానమి 2023 పేరుతో నివేదికను విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిట ఇన్ కమ్ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్ పర్ క్యాపిట ఇన్ కమ్ కేవలం రూ. 4.03 లక్షలకు పైగా ఉంది.అలాగే, హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీ హబ్ కారణం గానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు చెబుతున్నారు. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం లోని ఐటీ హబ్‌ లు రంగారెడ్డి జిల్లా వైపు తరలి పోతున్నట్లు పేర్కొంటున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) పరంగా కూడా, తెలంగాణ లోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. జిల్లా తలసరి ప్రతి వ్యక్తి జిల్లాలో సంవత్సరానికి ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

రంగారెడ్డి – రూ. 8,15,996, హైదరాబాద్ – రూ. 4,03,214, సంగారెడ్డి – రూ. 3,08,166, మేడ్చల్-మల్కాజిగిరి – రూ. 2,58,040, యాదాద్రి భువనగిరి – రూ. 2,47,184, నల్గొండ – రూ. 2,42,103, మహబూబ్ నగర్ – రూ. 2,40,900, మెదక్ – రూ. 2,32,384, భద్రాద్రి కొత్తగూడెం – రూ. 2,28,582, జయశంకర్ – రూ. 2,23,481 కోట్లుగా ఉంది.

తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితా లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you