Friday, March 21, 2025
HomeNewsTelanganaTelangana: అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరిరోజు భారీగా నామినేషన్లు

Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరిరోజు భారీగా నామినేషన్లు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 3వ తేదీ 10 వరకు నామినేషన్లకు ఎన్నికల కమీషన్ అవకాశం కల్పించింది. ఈనెల తొమ్మది వరకు, అంటే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న119 నియోజక వర్గాల్లో 2,474 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే చివరి రోజు నామినేషన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాఖలు అయిన నామినేషన్ల స్క్రుటినీ ఈ నెల 13న ఉంటుంది. అదేవిధంగా ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల లిస్ట్ ప్రకటిస్తారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments