Sunday, March 23, 2025
HomeNewsTelanganaవర్ష ప్రభావ ప్రాంతాల్లో దాన కిషోర్ పర్యటన

వర్ష ప్రభావ ప్రాంతాల్లో దాన కిషోర్ పర్యటన

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ తో పాటు.. వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ కు వెళ్లారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మాట్లాడుతూ… భారీ వర్షం నేపథ్యంలో జిహెచ్ఎంసి, జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలోకి దించాలన్నారు. ఈ బృందాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోవాలన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments