MLC ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు కుట్రలు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తమ పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహారశైలి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సమావేశంలో సీఎం రేవంత్, సీనియర్ నేత జానా రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లన్న, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ‘బీసీల సమర శంఖారావం’ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కౌంటింగ్ రోజున, విదేశీ పర్యటనలో ఉన్న ఓ మంత్రి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి, మల్లన్న ఓడిపోయే అవకాశమేమిటి అని అడిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తానని.. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.

బీసీల అండదండలతోనే తాను ఎమ్మెల్సీగా గెలిచానని, తన ఓటమికి స్కెచ్ వేసిన వారిని వచ్చే ఎన్నికల్లో ఒక్కరినీ కూడా గెలవనివ్వబోనని స్పష్టం చేశారు. ఇలా మాట్లాడటం వల్ల తన పదవి పోతుందన్నా, తగ్గబోనని.. మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందని చెబుతూ.. రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని హెచ్చరించారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.9 వేల కోట్లే కేటాయించడంపై, తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు మల్లన్న తెలిపారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img