Friday, April 18, 2025
HomeNewsTelanganaMLC KAVITHA: ఎమ్మెల్సీ కవితకు లండన్ లోని బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

MLC KAVITHA: ఎమ్మెల్సీ కవితకు లండన్ లోని బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పై లండన్ లో ఏర్పాటు చెయ్యబోయే సమావేశంలో కీలకోపన్యాసం చేయవలసిందిగా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. పార్లమెంటు పాస్ చేసిన మహిళ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన సందర్భంగా లండన్ లో అక్టోబర్ 6న ఒక సమావేశాన్ని ఏర్పటు చేస్తున్నామని ఆహ్వాన పత్రంలో పేర్కొంది.

IMG 20230930 WA0002

రాజకీయాల్లో, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కవిత విశేషంగా కృషి చేశారని ఆ సంస్థ ప్రశంసించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారని వివరించింది. ఇలా పలు రకాల కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా మహిళా బిల్లు పై చర్చను రేకెత్తించారని పేర్కొంది. జంతర్ మంతర్ లో దాదాపు 6000 మందితో ధర్నా నిర్వహించారని, ఈ ధర్నా కార్యక్రమానికి 18 పార్టీల నేతలు హాజరైన మద్దతు ప్రకటించారని తెలిపింది. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతపై ఢిల్లీలో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 13 రాజకీయ పార్టీలతో పాటు మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారని గుర్తు చేసింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments