Tuesday, April 22, 2025
HomeNewsTelanganaపార్టీ మారే అవసరం నాకు లేదు.. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్...

పార్టీ మారే అవసరం నాకు లేదు.. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని, మూడో సారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్ నే నమ్ముతారని అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితులల్లో తనపై కూడా కొన్ని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాటిని పార్టీ కార్యకర్తలు, ప్రజలు నమ్మొద్దని అన్నారు. తాను ఏ పార్టీలో వున్నా ఆ ఆపార్టీ విజయం కోసమే పని చేస్తానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు తనతో విడిపోయినా కూడా వారి విజయాన్నే కోరుకుంటానని అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తనకు అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వున్నారన్నారు. అందరూ కలిసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

ఇప్పుడు తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ, తన కుమారుడు కానీ ఎవరో ఒకరు పోటీ చేస్తామన్నారు. అంతే కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు.కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు ఘటన విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయని అంత మాత్రాన రాజకీయం చేయడం తగదన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments