Tuesday, March 25, 2025
HomeNewsTelanganaగతంలో దోచుకునేందుకే కేటీఆర్ విదేశీ యాత్రలు: మంత్రి కొండా సురేఖ

గతంలో దోచుకునేందుకే కేటీఆర్ విదేశీ యాత్రలు: మంత్రి కొండా సురేఖ

ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ (Konda sureka) బిఆర్ఎస్ (BRS) పార్టీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కెటిఆర్ (KTR) వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు అడ్డగోలుగా దోచుకునేందుకే కేటిఆర్ గతంలో అమెరికా పర్యటన చేశారని ఆరోపించారు. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన సాగుతున్నదని పేర్కొన్నారు. అయితే బిఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు.

గతంలో కెటిఆర్ షాడో సీఎం గా పనిచేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పడేమో కెటిఆర్, బిఆరెఎస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఎంఒయు లు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే అని అన్నారు. వాళ్ళ పత్రికలోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. బోగస్ కంపెనీలతో ఎంఒయులు చేసుకుని ప్రజలను మోసం చేశారన్నారు. ధాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్ లే, వీటిలో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అద: పాతాళంలోకి తొక్కే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments