NewsTelanganaగతంలో దోచుకునేందుకే కేటీఆర్ విదేశీ యాత్రలు: మంత్రి కొండా సురేఖ

గతంలో దోచుకునేందుకే కేటీఆర్ విదేశీ యాత్రలు: మంత్రి కొండా సురేఖ

-

- Advertisment -spot_img

ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ (Konda sureka) బిఆర్ఎస్ (BRS) పార్టీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కెటిఆర్ (KTR) వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు అడ్డగోలుగా దోచుకునేందుకే కేటిఆర్ గతంలో అమెరికా పర్యటన చేశారని ఆరోపించారు. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన సాగుతున్నదని పేర్కొన్నారు. అయితే బిఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు.

గతంలో కెటిఆర్ షాడో సీఎం గా పనిచేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పడేమో కెటిఆర్, బిఆరెఎస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఎంఒయు లు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే అని అన్నారు. వాళ్ళ పత్రికలోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. బోగస్ కంపెనీలతో ఎంఒయులు చేసుకుని ప్రజలను మోసం చేశారన్నారు. ధాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్ లే, వీటిలో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అద: పాతాళంలోకి తొక్కే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you