NewsTelanganaప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

-

- Advertisment -spot_img

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి కృష్ణారావు బుధ‌వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో సూప‌రిండెంట్, డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన మంత్రి, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (DMHO) డాక్టర్ స్వ‌రాజ్య‌ల‌క్ష్మిని మంత్రి ఆదేశించారు. ఒకవైపు రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటే, మరోవైపు వైద్యులు, సిబ్బంది విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం స‌మంజ‌స‌మేనా అని ప్ర‌శ్నించారు. స‌మ‌య‌పాల‌న పాటించాలని.. లేకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఆస్పత్రిలోని పలువురు పేషెంట్లతో మంత్రి జూప‌ల్లి మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. డాక్ట‌ర్లు, న‌ర్పులు స‌రైన స‌మ‌యానికి రావ‌టం లేద‌ని, పేషెంట్లపట్ల కొందరు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మంత్రికి వివ‌రించారు. వైద్య‌లు, సిబ్బంది రోగుల‌కు అందుబాటులో ఉండి సేవ‌లు అందించాల‌ని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం దవాఖానలోని పలు విభాగాలను మంత్రి పరిశీలించారు. వైద్యంకోసం వస్తున్న పేషెంట్లు వివిధ విభాగాలను తెలిగ్గా గుర్తించేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల‌న్నారు. త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఆసుప‌త్రి అభివృద్ధికి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 ల‌క్ష‌లు కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you