ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. మందకృష్ణతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువరిచిన విషయం తెలిసిందే.