NewsTelanganaపల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్.. ప్రకటన రాగానే పెద్దఎత్తున సంబరాలకు...

పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్.. ప్రకటన రాగానే పెద్దఎత్తున సంబరాలకు క్యాడర్ సిద్దం

-

- Advertisment -spot_img

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. అధిష్టానం ఇదివరకే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచింది. పెండింగ్ లో జనగామ కూడా ఉంది. గత కొన్ని రోజులుగా టికెట్ ఎవరికి వస్తుందోనని క్యాడర్ లో అయోమయం నెలకొని ఉంది. అయితే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీఎం కేసీర్ ఆర్టీసీ చైర్మెన్ పదవి కేటాయించారు. దీంతో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అయింది. ప్రగతి భవన్ పెద్దలు కూడా నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించడంతో పల్లాకే టికెట్ ఖాయమని తెలుస్తోంది. నేడోరేపో అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

ప్రతిరోజు నియోజకవర్గ నేతలతో, పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కలుస్తున్నారు. ఆయా గ్రామాలలో పార్టీ పరిస్థితులు, సమస్యలపై ఆరా తీస్తున్నారు. అప్పటికప్పుడే నిధుల మంజూరుకు అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరిస్తున్నారు. టికెట్ ప్రకటన రాగానే కొమురవెళ్లి నుండి జనగామకు భారీర్యాలీకి క్యాడర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకు కేటాయించిన కీలక ఆర్టీసీ చైర్మెన్ పదవిపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you