పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్.. ప్రకటన రాగానే పెద్దఎత్తున సంబరాలకు క్యాడర్ సిద్దం

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. అధిష్టానం ఇదివరకే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచింది. పెండింగ్ లో జనగామ కూడా ఉంది. గత కొన్ని రోజులుగా టికెట్ ఎవరికి వస్తుందోనని క్యాడర్ లో అయోమయం నెలకొని ఉంది. అయితే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీఎం కేసీర్ ఆర్టీసీ చైర్మెన్ పదవి కేటాయించారు. దీంతో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అయింది. ప్రగతి భవన్ పెద్దలు కూడా నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించడంతో పల్లాకే టికెట్ ఖాయమని తెలుస్తోంది. నేడోరేపో అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

ప్రతిరోజు నియోజకవర్గ నేతలతో, పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కలుస్తున్నారు. ఆయా గ్రామాలలో పార్టీ పరిస్థితులు, సమస్యలపై ఆరా తీస్తున్నారు. అప్పటికప్పుడే నిధుల మంజూరుకు అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరిస్తున్నారు. టికెట్ ప్రకటన రాగానే కొమురవెళ్లి నుండి జనగామకు భారీర్యాలీకి క్యాడర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకు కేటాయించిన కీలక ఆర్టీసీ చైర్మెన్ పదవిపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img