NewsTelanganaమహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం: శిల్పారెడ్డి

మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం: శిల్పారెడ్డి

-

- Advertisment -spot_img

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని.. మహిళలంటే కేటీఆర్ కు ఏ మాత్రం గౌరవం లేదని ఆమె ఫైర్ అయ్యారు.

వరలక్ష్మీ శుక్రవారం రోజున సంతోషంగా పండుగ జరుపుకుంటున్న మహిళలకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు క్షోభ కలిగిస్తున్నాయని అన్నారు. మహిళలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సమంజసమా? కాదా? అని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే కూడా తెలుస్తుందని అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా పేద, మధ్యతరగతి మహిళలలేనని, డబ్బుందనే అహంకారంతో కేటీఆర్ పేద, మధ్య తరగతి మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడో రకంగా మాట్లాడటం కేటీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేటీఆర్ ను బయట తిరగనీయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you