NewsTelanganaKTR: CM అంటే కటింగ్ మాస్టరా..? ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల తగ్గింపుపై...

KTR: CM అంటే కటింగ్ మాస్టరా..? ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల తగ్గింపుపై కేటీఆర్ ఫైర్

-

- Advertisment -spot_img

ప్రతీ పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే రేవంత్ సర్కార్ లక్ష్యమా?.. CM అంటే కటింగ్ మాస్టరా?.. అని ప్రభుత్వ పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‘ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు.. కానీ, అధికారంలోకి వచ్చాక.. నేడు 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీ మొత్తం ₹39 వేల కోట్లు అని.. ఇప్పుడు ₹31వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రేషన్ కార్డు లేదని.. లక్షలాది మందిని ₹500 సిలిండర్ పథకానికి దూరం చేశారన్నారు. అలాగే, 200 యూనిట్ల కరెంటు పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీని కూడా ఎగ్గొట్టి.. లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధు ఇంకా రావడం లేదన్నారు. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారనీ.. కానీ, అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అనే చందంగా కోత పెడుతున్నారని తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మాట తప్పినా… మడమ తిప్పినా… లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతామని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you