Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి నేడే చివరిరోజు.. బారులు తీరిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనానికి మొదటిరోజు నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి 70 అడుగుల భారీ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. వరుసగా నాలుగు రోజులు సెలవువు ఉండడంతో వినాయకుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శనివారం ఒక్కరోజే నాలుగున్నర లక్షలమంది ఖైరతాబాద్ బడా గణేషున్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం మంగళవారం ఉన్నా.. దర్శనం ఆదివారం అర్దరాత్రితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. సోమవారం రోజు భారీ వాహనానికి వెల్డింగ్ పనులు, శోభాయాత్రకు ఏర్పాట్లు, ఇతర పనులు ఉంటాయి కాబట్టి దర్శానానికి నేడే చివరిరోజు అని నిర్వాహకులు తెలిపారు.

దర్శనానికి ఆదివారం చివరిరోజు కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని పోలీసలు తెలిపారు. హైదరాబాద్ నుండే కాకుండా.. ఇతర జిల్లాల నుండి కూడా బడా గణనాథున్ని చూడడానికి భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని.. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా భద్రతను మానీటరింగ్ చేస్తున్నామని పోలీసులు చెపుతున్నారు. ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జనసందోహంతో క్రిక్కిరిసి పోతున్నాయి. అటు ఖైరతాబాద్ కు వచ్చే బస్సులు, మెట్రో స్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి.

ఖైరతాబాద్ భారీ గణనాథుని శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసులు సిద్దం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని అన్ని గణనాథుల శోభాయాత్రలకు పోలీసులు నిర్వాహకులకు ఇప్పటికే పలు కీలక సూచనలు చేశారు. రూట్ మ్యాప్ కు సంబందించి పోలీసలు బందోబస్తుకు సిద్దం అయ్యారు. హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ మూడు కమీషనరేట్ ల పరిదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భారీబందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బడా గణేషున్ని మద్యాహ్నం 1:30 లోపు గంగమ్మ ఒడికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

Topics

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img