NewsTelanganaమెద‌క్ ఎంపీ బ‌రిలో జ‌ర్న‌లిస్ట్‌..బీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా నామినేష‌న్‌

మెద‌క్ ఎంపీ బ‌రిలో జ‌ర్న‌లిస్ట్‌..బీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా నామినేష‌న్‌

-

- Advertisment -spot_img

బీఆర్ఎస్‌ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా హైదరాబాద్ జ‌ర్న‌లిస్ట్ లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానానికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ నేత గురువారం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. బీఆర్ఎస్ గ‌ట్టి ప‌ట్టున్న మెద‌క్ లో, ఆ పార్టీ గెలుపు ఆశ‌లు ఉన్న ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థిని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకువ‌చ్చిన సువిధ పోర్ట‌ల్ ద్వారా ఈనెల 22న ఆన్ లైన్ నామినేష‌న్ వేసిన మారేప‌ల్లి ల‌క్ష్మణ్‌… ఫిజిక‌ల్ గా మెద‌క్ క‌లెక్ట‌రేట్ కువెళ్లి ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి, కలెక్ట‌ర్ రాహుల్ రాజ్ కు రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. మేడ్చ‌ల్-మ‌ల్చాజిగిరి జిల్లా పేట్ బ‌షీరాబాద్లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన 38 ఎక‌రాల‌ను వారికి అప్ప‌గించాల‌ని సుప్రీంకోర్టు 2022 అగ‌స్టులో స్పష్ట‌మైన తీర్పు ఇచ్చినా.. అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్టి జ‌ర్నిలిస్టుల‌కు అన్యాయం చేయాల‌ని చూసింది. త‌మ స్థ‌ల సాధ‌న కోసం జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్టుల హౌసింగ్ సోసైటీ ఎన్నో రూపాల్లో పోరాడింది. ధ‌ర్నాలు చేసింది. చివ‌ర‌కు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేఎన్‌జే జ‌ర్న‌లిస్టులు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు. ఆ ప్ర‌య‌త్నంలో జేఎన్‌జే జ‌ర్న‌లిస్టులు స‌ఫ‌ల‌మై కేసీఆర్ ను ఓడించ‌డంలో త‌మ‌దైన పాత్ర పోషించారు. ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా త‌మ కార్యాచ‌ర‌ణ తీసుకుంది. ఇందులో భాగంగా సీనియ‌ర్ జ‌ర‌ల్నిస్టు మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ నేత మెద‌క్ లోక్ స‌భ స్థానానికి నామినేష‌న్ వేశారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తాన‌ని మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ మీడియాతో చెప్పారు. ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తామ‌ని, అధికారంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్, కేటీఆర్ చేసిన అరాచ‌కాలను జ‌నాల‌కు తెలియజేస్తామ‌న్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను నిధులు, నియామ‌కాలు, జ‌లాలు లేకుండా ఎలా ప్ర‌జ‌ల‌ను మోసం చేశారో ప్ర‌చారంలో ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకువెళ‌తామ‌ని పేర్కొన్నారు. మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ కు ప‌లు జ‌ర్న‌లిస్టు సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌కటించాయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...
- Advertisement -spot_imgspot_img

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you