Tuesday, March 25, 2025
HomeNewsTelanganaCherial Revenue Division: చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సెల్ టవర్ ఎక్కిన JAC...

Cherial Revenue Division: చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సెల్ టవర్ ఎక్కిన JAC నాయకులు

చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ JAC నాయకులు చేర్యాల మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నాయకులు అందె అశోక్, తాడెం ప్రశాంత్, బోయిని మల్లేశం సెల్ టవర్ ఎక్కి, రెవెన్యూ డివిజన్ ను ప్రభుత్వం ప్రకటించాలని నినాదాలు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా అకిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు JAC గా ఏర్పడి అనేక ఉద్యమాలు చేస్తున్నామని JAC నాయకులు తెలిపారు. ఎన్ని ఉద్యమాలు చేసినా.. చేర్యాల ప్రాంత ప్రజల ఆవేదనను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల స్వంత జిల్లా ఆయన సిద్దిపేటలో ఉన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని వెంటనే చేర్యాల డివిజన్ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.

IMG 20231009 WA0004
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments