హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలబెడుతా: మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రజా సమస్యలపై, ప్రజల వద్దకే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పర్యటన లో భాగంగా చిగురు మామిడి ,వై .సైధాపూర్ , ఎల్కతుర్తి , భీమదేవర పల్లి మండలాల్లో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో విసృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందులో తక్షణమే పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ ,తాగు నీటి లేకుండా చూడాలని ,స్కూల్ లలో జరుగుతున్న పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా దోమల విషయంలో కూడా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని తెలిపారు. పలు గ్రామాలకు ఆర్టీసి బస్సు రావడం లేదని ,సీసీ రోడ్ల నిర్మాణం,మురుగు కాలువల నిర్మాణం లాంటివి పూర్తి చేయాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు.

తనని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించారని వారు ఇచ్చిన అవకాశంతో మంత్రి అయి సేవ చేయడానికి వచ్చానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తొడ్పడతానని ఎంతా బిజీగా ఉన్న తనని గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడానికి నేరుగా మండలాలు గ్రామాల్లోకి వస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని ఎప్పటికీ హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం వెల్లడించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు,గ్రామ శాఖల అధ్యక్షులు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు ఎంపీపీలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img