NewsTelanganaవీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

-

- Advertisment -spot_img

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన రజక నేతలు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమం కోసం బీసీ సంక్షేమ శాఖ 15 లక్షల రూపాయలు కేటాయించింది. అందులో ఈనెల 26 న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం 12 లక్షల రూపాయలు కేటాయించగా, 10 వ తేది జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం 3 లక్షలు కేటాయించారు.

ఉత్సవాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చైర్మన్ గా 40 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాలకుర్తి లో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాలను అధికారులతో పరిశీలించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి సూచించారు. ఇప్పటికే ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహ రోడ్డు పనుల నేపథ్యంలో తొలగించిన గద్దె నిర్మాణం ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..

ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం తరుపున రవీంద్ర భారతిలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు భూమి కోసం, భుక్తి కోసం,విముక్తి కోసం ఆమె త్యాగం గ్రామగ్రామాన తెలిసేలా అన్ని గ్రామాల్లో ఉత్సవాలు జరపాలని కమిటీ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you